News

నోటీస్ వచ్చిన మాట నిజమే..


డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది. కొందరు నటులు తమకు ఈ కేసుతో సంబందం లేదని ప్రకటిస్తున్నారు.అయితే తమకు నోటీసులు వచ్చాయని వారు అంగీకరిస్తున్నారు. నటుడు నవదీప్ మాట్లాడుతూ తనకు నోటీస్ వచ్చిందని, అయితే తనకు ఎలాంటి సంబందం లేదని అన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన కెల్విన్ ఎవరూ తనకు తెలియదని అన్నారు.తను తెలిసిన విషయాలను అదికారులకు చెబుతానని, తను తప్పు చేయలేదని ఆయన అన్నారు. కాగా తనను డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరికించే ఉద్దేశంతో ఉన్నారేమోనని మరో నటుడు నందు అన్నారు.తను డ్రగ్స్ అలవాటు లేదని, బ్లడ్ సాంపుల్స్ ఇవ్వడానికి తాను సిద్దమని ఆయన అన్నారు. కాగా మరో నటుడు తనీష్ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.